అంతర్జాతీయ క్రికెట్లో వైడ్ బాల్ నియమాలు త్వరలో మారబోతున్నాయి. ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్నా సిరీస్ లో లెగ్ స్టంప్ వైడ్కు సంబంధించిన కొత్త రూల్ ను ఐసీసీ టెస్ట్ చేయడం. ఈ రూల్ ను మొదటిసారిగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఉపయోగించారు. మొదటి ఎడిషన్లోనే ఈ రూల్ విజయవంతమైంది. ఈ కొత్త రూల్ కారణంగా బౌలింగ్ చేయబడిన వైడ్ బాల్స్ సంఖ్య చాలా వరకు తగ్గింది. 2023 ఎడిషన్లో 319 వైడ్ బాల్స్ వేయబడ్డాయి. 2024 ఎడిషన్లో 311 బౌలింగ్ చేయబడ్డాయి. ఈ మార్పు కారణంగా వైడ్ బాల్స్ సంఖ్య తగ్గింది.
పాత రూల్:
వైడ్ బాల్ కు సంబంధించిన పాత రూల్ ఏంటంటే.. లెగ్ స్టంప్ దాటి వెళ్ళే ఏ బంతినైనా వైడ్ గా ప్రకటించేవారు. సెంటి మీటర్ గ్యాప్ తేడాలో బాల్ లెగ్ సైడ్ కు దూరంగా వెళ్లినప్పటికీ వైడ్ బాల్ గా పరిగణించేవారు. దీంతో బౌలర్ ఎక్స్ ట్రా డెలివరీ వేయవలసి వచ్చేది. ఈ రూల్ బౌలలకు ప్రతికూలంగా ఉండేది. కానీ ఇప్పుడు వైడ్ కు సపరేట్ క్రీజ్ ఉంది. ఈ రూల్ ఒకప్పుడు బ్యాటర్ కు అనుకూలంగా ఉండేది. కానీ ఇప్పుడు అటు బ్యాటర్ కు.. ఇటు బౌలర్ కు సమానంగా ఉంటుంది.
కొత్త రూల్:
ఈ కొత్త రూల్ ప్రకారం బ్యాటర్ క్రీజ్ లో ఉండి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ క్రీజ్ లు ఉంటాయి. ఈ లైన్లు లెగ్ స్టంప్కు కొంచెం దగ్గరగా గీస్తారు. లెగ్ సైడ్ లైన్ లోపల ఉన్న ఏ బంతినైనా వైడ్ ఇవ్వడానికి ఉండదు. ఇది బౌలర్లు లెగ్ సైడ్ వైపు ఎక్కువ బౌలింగ్ చేసినా ఎటువంటి అదనపు పరుగులు ఇవ్వకుండా చూసుకోవడానికి వీలు కల్పిస్తుంది. దానితో పాటు బ్యాటర్లకు కూడా ఈ రూల్ ప్రయోజనకరమే. ఈ రూల్ తో బ్యాటర్స్ తమ బ్యాటింగ్ స్కిల్స్ ను మెరుగుపరుచుకోవడానికి వీలుంటుంది.
