కొండగట్టు అంజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలి

కొండగట్టు అంజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలి

కొండగట్టు అంజన్న ఆలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటూ జగిత్యాల జిల్లా మాల్యల్ మండలంలో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాదయాత్ర చేపట్టారు. MLC  జీవన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామికి పూజలు చేసి కార్యకర్తలతో కలిసి పాదయాత్ర ప్రారంభించారు. ఆలయంలో కనీస వసతులు కూడా లేవని తెలిపారు పొన్నం ప్రభాకర్. ఆలయ అభివృద్దికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. అయితే పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేతలను కొండగట్టు పైకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. 

 

For More News..

నేను భారతీయుడిని.. తెలుగువాడిని, తెలంగాణవాడిని

యాదాద్రి నిర్మాణంలో వంద లోపాలు ఉన్నాయి