
కరోనా టైమ్లో నలుగురిలో ఉన్నప్పుడు మాస్క్ తప్పనిసరి. బయటికి వెళ్లినప్పుడు ఏమన్నా తినాలన్నా, తాగాలన్నా మాస్క్తో ఇబ్బందిగా ఉంటుంది. అయితే, ఈ నోస్ మాస్క్ ఉంటే ఆ ప్రాబ్లమ్ రాదు. మాస్క్ని ముక్కువరకు మడిచి, తినేయొచ్చు. దక్షణ కొరియాకు చెందిన అట్మన్ అనే కంపెనీ ఈ మాస్క్ తయారుచేసింది. ఈ కొత్తరకం మాస్క్ పేరు ‘కోస్క్’. కొరియన్ భాషలో ‘కో’ అంటే ముక్కు అని అర్థం. అందుకే ముక్కుని మాత్రమే కప్పి ఉంచే ఈ మాస్క్కి ‘కోస్క్’ అనే పేరు పెట్టారు. ఈ మాస్క్లో రెండు వరుసలు ఉంటాయి. నలుగురితో కలిసి తినేటప్పుడు, డ్రింక్స్ తాగేటప్పుడు నోటిని కప్పే మాస్క్ లేయర్ని ముక్కువరకు మడిస్తే సరిపోతుంది. పది మాస్క్లు ఉన్న బాక్స్ ధర 9,800 వొన్ (మన కరెన్సీలో రూ.160).