నాలుగు రోజులు మోస్తరు వానలు!

నాలుగు రోజులు మోస్తరు వానలు!

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రానున్న 4 రోజులు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం నుంచి ఆదివారం దాకా పలు జిల్లాల్లో వర్షాలు పడొచ్చని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు రాబోయే రెండ్రోజులు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

బుధవారం నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నాగర్​కర్నూల్​లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు  దాటేశాయి. అత్యధికంగా జక్రాన్ పల్లిలో 41.6 డిగ్రీలు, ఆదిలాబాద్​ అర్బన్​లో 41.5, తలమడుగు, భీమ్​గల్, తానూర్​లో 41.4 చొప్పున, నర్సాపూర్​, జైనద్​, కిష్టంపల్లి, మెండోరాల్లో 40.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డయిందని అధికారులు తెలిపారు.