నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​

నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​

నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​ను రాజ్యాంగంలోని ఆర్టికల్​ 21(జీవించే హక్కు), 48ఏ కింద నేషనల్​ ట్రిబ్యునల్​ చట్టం–2010 ప్రకారం ఏర్పాటైంది. దీని ఏర్పాటుతో భారత్​ ప్రపంచంలో పర్యావరణం కోసం ఒక ప్రత్యేక ట్రిబ్యునల్​ ఏర్పాటు చేసిన దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ తర్వాత మూడో స్థానాన్ని ఆక్రమించింది. నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​ ఏర్పాటుకు మూలం ధరిత్రీ సదస్సు(రియోడీ జెనిరో – బ్రెజిల్–1992). పర్యావరణ సంబంధిత కేసులను సమర్థవంతంగా పరిష్కరించడం, ఆస్తులు, వ్యక్తి సంబంధిత నష్టాలకు పరిహారం ఇవ్వడం లక్ష్యాలుగా పనిచేస్తుంది. 
నిర్మాణం
చైర్మన్​:
కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఈ ట్రిబ్యునల్​కు ఒక చైర్మన్​ను నియమిస్తుంది.
సభ్యులు: 1. జ్యుడీషియల్​ సభ్యులు – 10 మందికి తగ్గకుండా, 20 మందికి మించకుండా ఈ సభ్యులు ఉంటారు. 2. నిష్ణాతులైన సభ్యులు 10 మందికి తగ్గకుండా, 20 మందికి మించకుండాఈ సభ్యులు ఉంటారు. జ్యుడీషియల్​ మెంబర్స్, నిష్ణాతులైన సభ్యుల ఎంపికకు కేంద్ర ప్రభుత్వం ఒక నియామక కమిటీని ఏర్పాటు చేస్తుంది.
పదవీకాలం
    చైర్మన్​, సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాలు. వీరు పునర్నియామకానికి అనర్హులు.
    సుప్రీంకోర్టు న్యాయమూర్తి చైర్మన్​గా గానీ లేదా జ్యుడీషియల్​ సభ్యుడిగా గానీ నియమింపబడినట్లయితే పదవీ విరమణ వయస్సు – 70 ఏండ్లు.
    హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చైర్మన్​గా గానీ లేదా జ్యుడీషియల్​ సభ్యుడిగా గానీ నియమింపబడినట్లయితే అతడి పదవీ విరమణ వయస్సు 67 సంవత్సరాలు.
    నిష్ణాతులైన సభ్యుల పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు.
తొలగింపు, రాజీనామా
    అవినీతి, అసమర్థత, దివాళా తీయడం, నేరారోపణ రుజువుకావడం వంటి కారణాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు చైర్మన్​, జ్యుడీషియల్​ సభ్యులను వారి పదవి నుంచి తొలగిస్తుంది. 
    అవినీతి, అసమర్థత, దివాళా తీయడం, నేరారోపణ రుజువు కావడం వంటి కారణాల ఆధారంగా నిష్ణాతులైన సభ్యులను కేంద్ర ప్రభుత్వం తాను నిర్దేశించిన పద్ధతి ప్రకారం ఒక ఉత్తర్వు ద్వారా వారిని పదవి నుంచి తొలగిస్తుంది.