సినిమా చూసి పదో క్లాస్ పాస్ అయిన ఖైదీ

సినిమా చూసి పదో క్లాస్ పాస్  అయిన ఖైదీ

ఈ మధ్య బాలీవుడ్ సినిమా ‘దస్వీ’ విడుదలైంది కదా. అందులో కథ ప్రకారం హీరో గంగారామ్​ చౌదరి అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు. ఒక స్కామ్​లో జైలుకు వెళ్ళాల్సి వస్తుంది. అయితే, అక్కడే హీరోలో మార్పు వస్తుంది. జైల్లో ఉండగానే పదో క్లాస్​ చదివి, పరీక్షలు రాసి పాసవుతాడు. ఈ సినిమాలోని జైలు​ సీన్లను ఆగ్రాలోని సైంట్రల్​ జైలు​లో తీశారు. షూటింగ్​ జరుగుతుండగా, అక్కడ ఉన్న 12 మంది ఖైదీలకు ఈ సినిమా లైన్​ గురించి తెలిసింది. వెంటనే తాము కూడా చదువుకోవడం మొదలుపెట్టారు. ఎగ్జామ్స్​ రాశారు. తాజాగా ఉత్తరప్రదేశ్​ బోర్డ్​ విడుదల చేసిన పదోతరగతి ఫలితాల్లో పాసయ్యారు. ఈ విషయాన్ని ఆగ్రా జైలు​ సూపరింటెండెంట్​ వీకే సింగ్ చెప్పారు. పాసయిన ఖైదీల్లో  జితేంద్ర, అర్జున్​ అనే ఇద్దరికి 60శాతం పైగా మార్కులు వచ్చాయని చెప్పాడు. ఇది తెలిసి ‘దస్వీ’లో గంగారామ్​ చౌదరి పాత్రలో నటించిన బాలీవుడ్​ యాక్టర్​ అభిషేక్​ బచ్చన్​ సంతోషం వ్యక్తం చేశాడు. ‘సినిమాలో మనం నటించిన పాత్ర నిజజీవితంలో మంచిపనులకు ఇన్​స్పిరేషన్​గా మారితే ఆ ఆనందం ముందు అవార్డులు కూడా బలాదూరే’ అంటూ ట్వీట్​చేశాడు.