
- ఢిల్లీ ఎయిమ్స్, విదేశీ వర్సిటీల జాయింట్ స్టడీలో వెల్లడి
న్యూఢిల్లీ: మతిమరుపు బాధితులు పెరుగుతున్నారు. ప్రత్యేకించి వృద్ధుల్లో మతిమరుపు సమస్య ఎక్కువవుతోంది. మనదేశంలో 60 ఏళ్లకు పైబడినవారు ఇంచుమించు15 కోట్ల మంది ఉన్నారు. వీరిలో దాదాపు కోటి (8.44 శాతం) మందికి మతిమరుపు ఉందని ఢిల్లీ ఎయిమ్స్, సర్రీ వర్సిటీ (ఇంగ్లండ్) , సౌతెర్న్కాలిఫోర్నియా వర్సిటీ (అమెరికా), మిచిగాన్ వర్సిటీ (అమెరికా) సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. ఇండియాలోని 30వేల మందికిపైగా వృద్ధుల ఆరోగ్య స్థితిగతులపై ఇటీవల నిర్వహించిన ఓ సర్వే నివేదికను సెమీ సూపర్ వైజ్డ్ మెషీన్ లెర్నింగ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నిక్ద్వారా విశ్లేషించి ఈ అంచనాకు వచ్చారు. వృద్ధుల్లోనూ ప్రత్యేకించి మహిళలు, నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల వారిలో మతిమరుపు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయని స్టడీ రిపోర్ట్లో పేర్కొన్నారు.