పెద్దపులి ఎక్కడుందో ? ఎటు పోయిందో ?..మూడు రోజులుగా పులి జాడ దొరుకుతలేదు

పెద్దపులి ఎక్కడుందో ? ఎటు పోయిందో ?..మూడు రోజులుగా పులి జాడ దొరుకుతలేదు
  • టెన్షన్ లో యాదాద్రి, సిద్దిపేట జిల్లాల ఫారెస్ట్​ ఆఫీసర్లు 

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో కనిపించిన పెద్ద పులి జాడ దొరుకతలేదు. ఫారెస్ట్​డిపార్ట్​మెంట్​ను టెన్షన్ పెట్టిస్తోంది. ట్రాప్​ కెమెరాకు  చిక్కడంలేదు.  మూడు రోజులుగా అది ఎక్కడ ఉందో..?  ఎటువైపువెళ్లిందో తెలియక అటవీ అధికారులకు  తల నొప్పిగా మారింది.  

దత్తాయిపల్లి గుట్టలు, పెద్దకంచెలో పెద్ద పులి జాడ కోసం16 ట్రాప్​ కెమెరాలకు పెట్టినా చిక్కకుండా పెద్ద పులి చిక్కలేదు. ఈనెల 28న ఆవు చంపి తలను విడిచి పెట్టి మొత్తం తినేసింది. కానీ దాని సమీపంలోని ట్రాప్​కెమెరాకు చిక్కలేదు. మేకను ఎరగా వేసి బోను పెట్టినా చిక్కలేదు. 

ఆ తర్వాత యాదాద్రి జిల్లా సరిహద్దు తుర్కపల్లి మండలంలోని తిర్మలాపూర్​, కొండాపూర్​వరకు పులి పాదముద్రలు కనిపించాయి. ఆ తర్వాత దొరకలేదు. దీంతో సరిహద్దు జిల్లా సిద్దిపేటలోకి వెళ్లిందని భావించారు.  అక్కడి ఆఫీసర్లను సంప్రదించగా రాలేదని చెప్పినట్టు తెలిసింది. మూడు రోజులుగా దాని జాడ తెలియక యాదాద్రి జిల్లా ఫారెస్ట్​స్టాఫ్​ నాలుగు టీమ్స్​పులి జాడ కనిపెట్టేందుకు గాలింపు చేపట్టాయి.  

యాదాద్రి జిల్లాలో శ్రీనివాసపురం అడవి ఉండగా, సిద్దిపేటలో పీర్లపల్లి ఫారెస్ట్​ ఉంది. యాదాద్రి జిల్లాలోని కొండాపూర్​ వరకు కన్పించిన పులి పాదముద్రలు ఆ తర్వాత కన్పించ లేదు. దీంతో ఆ పులి ఏదైనా అడవిలోకి వెళ్లిందా.? అన్న అనుమానాలు వస్తున్నాయి. అడవిలోకి వెళ్తే పెద్దపులి సమస్య పరిష్కారమైనట్టే అని ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​భావిస్తోంది.