- జైకోవ్డీ వ్యాక్సిన్ కోటి డోసులు కొంటం
- ఒక్కొక్కటి రూ.265 చొప్పున కొనేందుకు కేంద్రం ఆర్డర్
- సూది లేకుండా జెట్ అప్లికేటర్ ద్వారా వేస్తరు
న్యూఢిల్లీ: గుజరాత్కు చెందిన ఫార్మా కంపెనీ జైడస్క్యాడిలా తయారు చేసిన ‘జైకోవ్డీ’ కరోనా వ్యాక్సిన్ మరికొద్ది రోజుల్లో దేశంలో అందుబాటులోకి రాబోతోంది. టీకా రేటును తగ్గించేందుకు కంపెనీ ఓకే చెప్పడంతో కోటి డోసులను కేంద్రం ఆర్డర్ చేసింది. ఒక్కో డోసును రూ.265కు కొంటోంది. సూది లేకుండా(నీడిల్ఫ్రీ) జెట్అప్లికేటర్ద్వారా డైరెక్ట్గా ఇచ్చే ఈ వ్యాక్సిన్ను 12 ఏండ్ల పైబడిన వారికి వేసేందుకు ఈ ఆగస్టులోనే కేంద్రం అనుమతిచ్చింది. ప్రపంచంలో కరోనా కట్టడికి తయారు చేసిన తొలి డీఎన్ఏ బేస్డ్ టీకా ఇదే. ఈ టీకాను మూడు డోసుల్లో 28 రోజులకోసారి ఇవ్వాలని జైడస్ క్యాడిలా కంపెనీ ఇప్పటికే చెప్పింది. మూడు డోసులకు కలిపి తొలుత రూ.1,900గా ధరను కంపెనీ ఫిక్స్ చేసింది. ప్రభుత్వం చర్చలు జరిపాక రేటును తగ్గించింది.
వేరే రోగాలున్నోళ్లకు..
ఇతర రోగాలు ఉన్న వాళ్లకు జైకోవ్డీ టీకా ఇచ్చేందుకు నేషనల్టెక్నికల్అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్(ఎన్టీఏజీఐ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీకా డ్రైవ్లో ఈ వ్యాక్సిన్ను వాడేందుకు కావాల్సిన ప్రొటోకాల్, ఫ్రేమ్వర్క్ను ఎన్టీఏజీఐ రెడీ చేస్తోంది. ఎన్టీఏజీఐ రికమండేషన్ కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. జైకోవ్డీ టీకాను జెట్ఇంజెక్టర్ ద్వారా ఇస్తారు. ఒక్కో ఇంజెక్టర్తో 20వేల మందికి టీకా వేయొచ్చు. టీకాలోని మందును జెట్అప్లికేటర్ శరీరంలోకి పంపిస్తుంది.