బ్యాంకుకు కన్నమేసి అమ్మానాన్నలకు గిఫ్ట్‌‌‌‌లు

బ్యాంకుకు కన్నమేసి అమ్మానాన్నలకు గిఫ్ట్‌‌‌‌లు

నాగ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌: మహారాష్ట్రలోని నాగ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో ఓ కుర్రోడు అమ్మా, నాన్నలకు గిఫ్ట్‌‌‌‌లు ఇచ్చేందుకు బ్యాంక్‌‌‌‌ను దోచిండు. ఆ డబ్బుతో తల్లికి 50వేల నగలు, తండ్రికి 40వేలతో ఓ సెకండ్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ కార్‌‌‌‌‌‌‌‌ కొనిచ్చిండు. అజయ్‌‌‌‌ బంజారే(18) తన ఫ్రెండ్‌‌‌‌ ప్రదీప్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ ఇద్దరూ కలిసి  నాగ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లోని‌‌‌‌ కో ఆపరేటివ్‌‌‌‌ బ్యాంకుకు కన్నంవేసి రూ.4.78 లక్షలకు పైగా విలువైన క్యాష్​, నగలను ఎత్తుకెళ్లారు. అజయ్ తన పేరెంట్స్‌‌‌‌కు గిఫ్ట్‌‌‌‌లిచ్చాక ఇద్దరూ కలిసి రాజస్థాన్‌‌‌‌ వెళ్లిపోవాలని ప్లాన్‌‌‌‌ చేసుకున్నారు. ఖరీదైన మొబైల్స్ కొన్నారు. మరో సెకండ్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ కారు కొనేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు వారిని అరెస్ట్‌‌‌‌ చేసి రూ. 2 లక్షలు రికవరీ చేశారు. అజయ్‌‌‌‌ తన అమ్మా నాన్నలను ఆకట్టుకునేందుకు దొంగగా మారాడని పోలీసులు తెలిపారు.