- ఆకట్టుకున్న స్టూడెంట్ల ప్రదర్శనలు
ముషీరాబాద్, వెలుగు : బాగ్లింగంపల్లి లోని కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల్లో మూడ్రోజుల పాటు నిర్వహించిన ప్రాజెక్ట్ ఎక్స్ షో సోమవారం ముగిసింది. చివరిరోజు స్టూడెంట్లు వినూత్నంగా తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు. 100 మోడల్స్ ను ప్రదర్శించి అబ్బురపరిచారు. ఈ ప్రాజెక్ట్ షోను విద్యాసంస్థల సెక్రటరీ పీవీ రమణ్ కుమార్ సందర్శించారు. ఉత్తమ ప్రాజెక్టులకు బహమతులను అందజేశారు.
ప్లాస్టిక్తో పర్యావరణానికి ముప్పు
ముషీరాబాద్ : ప్లాస్టిక్ వల్లనే పర్యావరణానికి ముప్పు ఉందని తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి. నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్లాస్టిక్ను ఈ దశలో నిషేధించకపోతే అది పెనుభూతంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో ఈ– వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ జరిగింది.
చీఫ్ గెస్టుగా హాజరైన నాగేశ్వరావు మాట్లాడుతూ.. ప్లాస్టిక్, ఎలక్ట్రిసిటీ వ్యర్థాలను ఎలా నిషేధించాలనే అంశంపై స్టూడెంట్లకు ఆయన అవగాహన కలిగించారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా స్టూడెంట్లు ఈ– వేస్టేజ్ను సేకరించి వాటిని నిర్మూలించే సంస్థలకు అందజేయాలని కోరారు.