భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును లారీ ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఆంబోజు కృష్ణ, అతని కొడుకు అక్కడికక్కడే మృతిచెందగా.. హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో కూతురు చనిపోయింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో బంధువులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడు ఆంబోజు కృష్ణ కరకగూడెంలో RMPగా పని చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం