ఫుకెట్ (థాయ్లాండ్) : టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్, ఇండియా స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు పారిస్ ఒలింపిక్స్ బెర్తు దాదాపు ఖరారైంది. ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ కప్లో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్-–బి విమెన్స్ 49 కేజీ పోటీల్లో తను మూడో స్థానం సాధించింది. గాయం నుంచి కోలుకొని ఆరు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన చాను మొత్తం 184 కేజీల (స్నాచ్ 81 కేజీ+జెర్క్ 103 కేజీ) బరువు ఎత్తింది.
ఒలింపిక్స్కు చివరి, కచ్చితంగా పాల్గొనాల్సిన ఈ టోర్నీలో బరిలోకి దిగడంతో చాను పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణాలను అందుకుంది. 2017 వరల్డ్ చాంపియన్ అయిన చాను విమెన్స్ 49 కేజీ ఒలింపిక్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్ (ఓక్యూఆర్)లో రెండో స్థానంలో ఉంది. ప్రతీ వెయిట్ కేటగిరీలో టాప్–10 లిఫ్టర్లు ఒలింపిక్స్కు క్వాలిఫై అవుతారు. వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత పారిస్కు అర్హత సాధించిన వారి వివరాలను అధికారికంగా వెల్లడిస్తారు.