మరోసారి టాలీవుడ్ కీలక సమావేశం వాయిదా

మరోసారి టాలీవుడ్ కీలక సమావేశం వాయిదా

మరోసారి టాలీవుడ్ కీలక సమావేశం వాయిదా పడింది. రేపు జరగవలసిన సమావేశం పడింది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో జరగవలసిన సమావేశం. పరిశ్రమలోని పలువురు పెద్దలకు, అన్ని విభాగాలకు ఆహ్వానం అందించారు. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిల మీటింగ్ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.  పలువురు ప్రముఖుల నుండి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 

ఏపీ సర్కార్ రాష్ట్రంలో సినిమా టికెట్స్ రేట్స్ తగ్గించడంపై ఇప్పటికే సినీ ప్రముఖులు.. సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం సాగిర విషయం తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం మంత్రి పేర్ని నానితో సమావేశయ్యారు. ఇక వాదనలు.. ప్రతివాదనల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒంటరిగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశమై.. సినిమాకు సంబంధించిన పరిస్థితులు, ఇబ్బందులు వంటి అంశాలపై చర్చించారు. వీరి మీటింగ్ అనంతరం చిరు మాట్లాడుతూ.. జగన్ చాలా సానుకూలంగా స్పందించారని.. సినీ పరిశ్రమ మేలు కోసమే సీఎంతో భేటీ అయ్యానని చెప్పారు. 

ఇవి కూడా చదవండి: 

రేపు హైదరాబాద్ కు రానున్న కేంద్ర మంత్రి అమిత్ షా

వందేళ్లయినా కాంగ్రెస్ అధికారంలోకి రాదు