
కేతేపల్లి( నకిరేకల్ ), వెలుగు: కేతేపల్లి మండలంలోని హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారి 65 పై కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద ఆదివారం మధ్యాహ్నం వాహనాల రద్దీ నెలకొంది. బోనాల పండుగ, శ్రీకృష్ణాష్టమి, ఆదివారం.. వరుసగా సెలవులు రావడంతో హైదరాబాద్నుంచి గ్రామాలకు వెళ్లినవారు తిరుగు పయనమయ్యారు. టోల్గేట్వద్ద సమయం వృథా అవుతోందని, రద్దీగా ఉన్న రోజుల్లో క్యూలైన్లు పెంచాలని వాహనదారులు కోరుతున్నారు.