మెదక్‌ జిల్లాలో విషాదం..అల్లుడు చనిపోయిన విషయం తెలిసి..గుండెపోటుతో అత్త మృతి

మెదక్‌ జిల్లాలో విషాదం..అల్లుడు చనిపోయిన విషయం తెలిసి..గుండెపోటుతో అత్త మృతి
  • మెదక్‌‌‌‌ జిల్లా కేంద్రంలో  ఘటన

మెదక్, వెలుగు : అల్లుడు చనిపోయిన విషయం తెలియడంతో గుండెపోటుతో అత్త సైతం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మెదక్‌‌‌‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగింది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మెదక్‌‌‌‌ జిల్లా కేంద్రానికి బాల వెంకటరమణ (44) గజ్వేల్‌‌‌‌ డిగ్రీ కాలేజీలో రికార్డ్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో భోజనం అనంతరం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో  కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు గమనించేలోపే చనిపోయాడు.

ఈ విషయాన్ని వెంకటరమణ భార్య.. మెదక్‌‌‌‌లోనే ఉంటున్న తన చిన్నాన్న అయ్యవారి వెంకటేశ్వర్లుకు చెప్పింది. ఆయన తన భార్య ఇందిర (45)కు విషయం చెప్పగా.. ఆమె షాక్‌‌‌‌కు గురై స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను వెంటనే హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లగా.. అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు గంటల వ్యవధిలోనే చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.