- 62 వేల మంది మహిళలకు ట్రెయినింగ్
- ప్రకటించిన మైక్రోసాఫ్ట్, సాప్
- ఇందుకోసం టెక్సాక్షమ్ ప్రోగ్రామ్
బెంగళూరు: టెక్నాలజీలు పెద్దగా తెలియని మహిళా స్టూడెంట్లకు వాటిని నేర్పించడానికి మైక్రోసాఫ్ట్, శాప్ కంపెనీలు గురువారం ‘సాక్షమ్’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాయి. టెక్నాలజీ స్కిల్స్ నేర్పించి వారి కెరీర్ డెవెలప్మెంట్కు సాయపడటం కోసమే ఈ ప్రయత్నమని తెలిపాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్డిజైన్, డిజిటల్ మార్కెటింగ్లో 62 వేల మందికి ట్రెయినింగ్ ఇస్తారు. ఏఐసీటీఈ ట్రెయినింగ్ అండ్ లెర్నింగ్ (అటల్) అకాడమీ, స్టేట్ కాలేజీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లతో ఒప్పందం కుదుర్చుకొని 1,500 మంది టీచర్లకు కూడా ట్రెయినింగ్ ఇస్తారు. ఒక టీచర్ ఏడాదిలో కనీసం 50 మందికి డిజిటల్ స్కిల్స్లో ట్రెయినింగ్ ఇవ్వాలి.