మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌‌లో గాయత్రి జోడీ శుభారంభం

మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌‌లో గాయత్రి జోడీ శుభారంభం

బ్యాంకాక్‌‌: ఇండియా డబుల్స్‌‌ షట్లర్లు పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ థాయ్‌‌లాండ్  మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌‌లో శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన విమెన్స్‌‌ డబుల్స్‌‌ తొలి రౌండ్‌‌లో ఆరోసీడ్  గాయత్రి–ట్రీసా 16–21, 21–10, 21–18తో హాంకాంగ్‌‌కు చెందిన లొక్ లుయి–వింగ్ యుంగ్‌‌పై మూడు గేమ్స్‌‌ పాటు పోరాడి గెలిచి రెండో రౌండ్ చేరుకున్నారు. మరో మ్యాచ్‌‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో 21–13, 21–17తో లింగ్ ఫంగ్ హు–జియవో మిన్ (చైనీస్‌‌ తైపీ) జంటపై విజయం సాధించారు. రెండో రౌండ్‌‌లో గాయత్రి–ట్రీసాతో అశ్విని–క్రాస్టో తలపడనున్నారు. కాగా మెన్స్‌‌ సింగిల్స్‌‌లో సమీర్ వర్మ, శంకర్ ముత్తుస్వామి క్వాలిఫయింగ్‌‌లో రెండు మ్యాచ్‌‌ల్లో గెలిచి మెయిన్‌‌ డ్రాకు క్వాలిఫై అయ్యారు.