
త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అపూర్వమైన అభివృద్ధిని సాధించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన నడ్డా త్రిపుర సీఎం మాణిక్ సాహా, మాజీ సీఎం బిప్లబ్ దేబ్తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళల సాధికారత నుండి రాష్ట్ర ప్రజల సమగ్రాభివృద్ధి వరకు రాష్ట్రంలో అపూర్వమైన పురోగతి సాధించామని చెప్పారు. పారిశ్రామిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లో ప్రభుత్వ పనితీరు ఆధారంగా ప్రజలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారని అన్నారు.
The per capita income of Tripura has increased by 30%.
— BJP (@BJP4India) August 29, 2022
The agricultural income has doubled from Rs 6500/pm to Rs 11,000/pm.
The work is being carried out on 6 National Highways.
Landless labourers who worked in the tea garden have been given ownership of land.
- Shri @JPNadda pic.twitter.com/u0vrNuhppY
త్రిపురను సీపీఎం 35 ఏండ్లు పాలించినా మహిళా సాధికారత కోసం ఏమీ చేయలేదని జేపీ నడ్డా ఆరోపించారు. గిరిజనులను విస్మరించి యువకులను దోపిడీ చేసిందన్నారు.సమాజంలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి బీజేపీ ప్రజలతో కలిసి పనిచేస్తోందని నడ్డా అన్నారు. బీజేపీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో రాష్ట్ర ఆదాయం 30 శాతం పెరిగిందన్నారు. తేయాకు తోటలో పనిచేసిన భూమిలేని కూలీలకు భూమిపై యాజమాన్య హక్కు కల్పించామన్నారు. గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ ఉండే విధంగా 6 జాతీయ రహదారుల పనులు వేగంగా సాగుతున్నాయని జేపీ నడ్డా స్పష్టం చేశారు.
CPM ruled for 35 years but failed to do anything for the empowerment of women. It ignored tribals and exploited the youths.
— BJP (@BJP4India) August 29, 2022
They encouraged terrorism and infiltration, the insurgency was at its peak, cast tensions were created and drug smuggling thrived.
- Shri @JPNadda pic.twitter.com/ySRaqrHe2s