
సత్తుపల్లి, వెలుగు: పలుచోట్ల బీజేపీ జెండా దిమ్మెలపై టీఆర్ఎస్ జెండా పండుగను నిర్వహించారు. సత్తుపల్లి పట్టణంలోని సిద్దారం రోడ్, హనుమాన్ నగర్ ప్రాంతాల్లో టీఆర్ఎస్ లీడర్లు బీజేపీ జెండా దిమ్మెలకు రాత్రికి రాత్రే తమ పార్టీ రంగులు వేసి గురువారం జెండా పండుగ నిర్వహించారు. దీంతో శుక్రవారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగస్వామి స్థానిక పోలీస్స్టేషన్లో ఎస్సై రాములుకు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ లీడర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్, సుదర్శన్ మిశ్రా, రాఘవరావు తదితరులు ఉన్నారు.