
ప్రభుత్వ చీఫ్ విప్, TRS ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్కు హైదరాబాద్ నాంపల్లి స్పెషల్ కోర్టు ఇవాళ(బుధవారం) జైలు శిక్ష విధించింది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఖాజీపేట దగ్గర రైల్ రోకోలో పాల్గొన్న కేసుకు సంబంధించి ఆయనపై నేరం రుజువైనట్లు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తెలిపింది. ఈ కేసులో... వినయ్ భాస్కర్ సహా 18 మందికి కోర్టు రూ.3 వేలు జరిమానా విధించింది. అయితే.. దాస్యం వినయ్ భాస్కర్ అభ్యర్థనతో కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం.
దాస్యం వినయ్భాస్కర్ ప్రస్తుతం పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా TRS నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వినయ్ భాస్కర్.. 2015 జనవరిలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు. 2019, సెప్టెంబర్ 7న ప్రభుత్వ చీఫ్విప్గా దాస్యం వినయ్ భాస్కర్ నియమితులయ్యారు.