సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును కలిసిన జిన్నారం రైతులు

 సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును కలిసిన జిన్నారం రైతులు

జిన్నారం, వెలుగు: రైతు మహాధర్నాతో ప్రభుత్వం దిగివచ్చి రైతు భరోసా నిధులను వేసిందని జిన్నారం రైతులు అన్నారు. గురువారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును బీఆర్ఎస్ నాయకులతో  కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గంలో 4 మండలాలకు రైతు భరోసా నిధులు రాకపోవడంతో ఈనెల 21న జిన్నారంలో మహాధర్నా పేరుతో హరీశ్ రావు చేసిన ఆందోళనతో ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదలచేసిందన్నారు. 

కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి ఆదర్శ్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వెంకటేశం గౌడ్, గోవర్ధన్ రెడ్డి, బాల్ రెడ్డి, సోమిరెడ్డి, అంజయ్య యాదవ్, సురేందర్ గౌడ్, ప్రకాశ్ చారి, మండల పార్టీ అధ్యక్షుడు రాజేశ్, మాణిక్ యాదవ్, తదితరులు  ఉన్నారు.