
మెదక్, వెలుగు: డ్రగ్స్ రహిత సమాజానికి యువత ఉద్యమించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. గురువారం మెదక్ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ తో పాటు ఎస్పీ శ్రీనివాసరావు, అడిషనల్ కలెక్టర్ నగేశ్, సీనియర్ సివిల్ జడ్జి రుబీనా ఫాతిమా, అడిషనల్ ఎస్పీ మహేందర్, ఆర్అండ్ బీ ఈఈ సర్దార్ సింగ్, జిల్లా సంక్షేమ అధికారి హైమావతి, స్టూడెంట్స్ తో కలిసి ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్ల పట్ల ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణలో పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు
కౌడిపల్లి: నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కౌడిపల్లి మండలంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. దేవులపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలను, ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో నిర్మించిన మోడల్ హౌస్ ని పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 9 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా ఇప్పటివరకు 3,500 మంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మిగతా లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలను ప్రారంభించాలన్నారు.
కౌడిపల్లి పీహెచ్సీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరు పట్టికను పరిశీలించారు. ప్రతిరోజు ఎంతమంది రోగులు వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, మందులు అందుబాటులో ఉన్నాయా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనాన్ని పరిశీలించి ఎలక్ట్రిసిటీ, టైల్స్, డోర్స్, విండోస్ మైనర్ వర్క్స్ త్వరగా పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో కరిముల్లా, డాక్టర్ శ్రీకాంత్, కార్యదర్శి జ్యోతి ఉన్నారు.
డ్రగ్స్ను నిర్మూలించాలి: ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి టౌన్: యాంటీ డ్రగ్స్ వారోత్సవాల్లో మాత్రమే కాకుండా ఏడాది పొడవునా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్పీ పరితోశ్పంకజ్అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో స్టూడెంట్స్కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డ్రగ్స్వల్ల కలిగే చెడు పరిణామాలను యువత గుర్తించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తుపదార్థాలు అమ్మినా, విక్రయించినా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1908, 8712656777 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సౌజన్య మాట్లాడుతూ డ్రగ్స్రహిత జిల్లాగా మార్చడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, ఎక్సైజ్ ఎస్పీ నవీన్ చంద్ర, డీఈవో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్వో గాయత్రి, అధికారులు పాల్గొన్నారు.
డ్రగ్స్బారిన పడవద్దు: కలెక్టర్ హైమావతి
.సిద్దిపేట రూరల్: యువత డ్రగ్స్బారిన పడవద్దని కలెక్టర్హైమావతి సూచించారు. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్కు బారిన పడినవారికి ప్రభుత్వ ఆస్పత్రిలోని డీ అడిక్షన్ సెంటర్ ద్వారా కౌన్సెలింగ్, వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సీపీ అనురాధ మాట్లాడుతూ.. యువత, స్టూడెంట్స్డ్రగ్స్బారిన పడి భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు.
అనంతరం కలెక్టర్పోలీస్, హైవే అధికారులతో సమీక్షించారు. రాజీవ్ రహదారి వెంట సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, మలుపుల వద్ద రోడ్డు కనిపించకుండా ఆవరించిన మొక్కలు, చెట్ల పొదలను తొలగించాలని సూచించారు. అనంతరం జిల్లాలో డి అడిక్షన్ సెంటర్ ను సంప్రదించిన బాధితులు వారికి అందించిన చికిత్స నమోదైన కేసుల వివరాలను తెలుసుకున్నారు.
కోహెడ (హుస్నాబాద్) : డ్రగ్స్నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ హైమావతి అన్నారు. హుస్నాబాద్లో ప్రజా సంఘాలు, పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. స్టూడెంట్స్ తో మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని సూచించారు. లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, ఆర్డీవో రామ్మూర్తి పాల్గొన్నారు.
మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దు: కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి టౌన్ : యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని కలెక్టర్ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో ఎస్పీ పరితోశ్పంకజ్తో కలిసి డ్రగ్స్నిర్మూలన ర్యాలీని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ర్యాలీ కలెక్టరేట్ నుంచి సంగారెడ్డి ఐబీ వరకు కొనసాగింది. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, అడిషనల్ఎస్పీ సంజీవ్ రావు, జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి, డీఈవో వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.