
రైతులతో పెట్టుకున్న చంద్రబాబుకి ఏ గతి పట్టిందో బీజేపీ ప్రభుత్వానికి అదే గతి పడుతుందన్నారు MLA జీవన్ రెడ్డి. ఎంపీ అర్వింద్.. ప్రెస్ మీట్స్ పెట్టడం తప్ప చేసేదేమీ లేదన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించలేని బీజేపీ ఏంపీలు.. ఉన్నా లేకున్నా ఒక్కటేనని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం వరుసపెట్టి అమ్ముతోందని ఫైర్ అయ్యారు. కర్షకులు, కార్మికులతో అనవసరంగా పెట్టుకొవొద్దన్నారు జీవన్ రెడ్డి. బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయన్నారు.