
జెరూసలెం: ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అంతమొందించేందుకు ఇరాన్ కుట్రలు పన్నుతోందని అన్నారు. "ఇరాన్కు ట్రంపే నంబర్ వన్ శత్రువు. ట్రంప్ ఏ సమస్యనైనా పరిష్కరించగల సమర్థుడు. ప్రత్యర్థికి అస్సలు లొంగిపోడు. బలహీన బేరసారాలు చేయడానికి ఎప్పుడూ ఇష్టపడరు. గతంలోనూ ఆయన ఇరాన్తో అమెరికా చేసుకున్న ఫేక్ అణు ఒప్పందాన్ని చించిపారేశారు.
అంతేగాక, ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)లోని కుద్స్ ఫోర్స్ కమాండరైన ఖాసిమ్ సులేమానీని చంపేశారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదనే లక్ష్యంతో ట్రంప్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఇరాన్ ఆయనను చంపాలని చూస్తోంది" అని నెతన్యాహు ఆరోపించారు.