
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్ ఆర్మీచీఫ్ మార్షల్ అసిమ్ తో ఈరోజు ( జూన్ 18) మధ్యాహ్నం ఒంటి గంటకు వైట్హౌస్ క్యాబినెట్ రూంలో భోజన సమావేశం జరగనుంది.
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది భారత పౌరులు మరణించిన తర్వాత మునీర్ అమెరికాకు చేసిన మొదటి అధికారిక పర్యటన ఇది. మునీర్ తన పర్యటనలో విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో.. రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెలతో కూడా సమావేశం కానున్నారు.
పాకిస్తాన్ ఆర్మీచీఫ్ మునీర్ అమెరికా పర్యటన రెండు దేశాల మధ్య సైనిక మరియు వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. పాకిస్తాన్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని భారత్ తెలిపింది.
దక్షిణాయాసిలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్యం వహించేందుకు వాణిజ్యపరమైన అంశాన్ని ట్రంప్ లేవనెత్తారని .. ఈ అంశాన్ని భారత్ ఖండించిది. అయితే పాకిస్తాన్ మద్దతు తెలిపింది. రెండు దేశాలు వెనక్కి తగ్గేలా ప్రోత్సహించడానికి వాణిజ్య పరపతిని ఉపయోగించానని పేర్కొంటూ, సంధికి మధ్యవర్తిత్వం వహించినందుకు ట్రంప్ ఘనత సాధించారు . అయితే అమెరికా మధ్యవర్తిత్వ పాత్ర పోషించలేదని భారత్ వెంటనే ఖండించింది.
కెనడాలో జరిగే గ్రూప్ ఆప్ సెవెన్ సమ్మిట్ లో భారత ప్రధాని మోదీ.. ట్రంప్ మధ్య సమావేశం జరుగుతుందని.. అప్పుడు కొత్త వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయని ఊహించారు. కాని సమావేశానికి ముందే ట్రంప్ వాషింగ్టన్ వెళ్లారు. తమ దేశంలో ప్రస్తుతం ఉన్నగందరగోళాన్ని పరిష్కరించుకోవాల్సి వచ్చిందని ట్రంప్ తెలిపారు. భారత ప్రధాని మోదీ జీ 7 సమావేశానికి హాజరు కారని మొదట్లో వార్తలు వచ్చినప్పటికి... కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత్ ను ఆహ్వానించారు.
జూన్ 14న జరిగిన యుఎస్ ఆర్మీ 250వ వార్షికోత్సవ వేడుకలకు మునీర్ను ఆహ్వానించారని వైట్ హౌస్ తిరస్కరించిన కొద్ది రోజులకే ఈ సమావేశం గురించిన నివేదికలు వచ్చాయి. ఇది కవాతులో ఆయన హాజరైనట్లు గతంలో వచ్చిన వాదనలకు విరుద్ధంగా ఉంది.