ఏప్రిల్‌ వరకు అమెరికా పౌరులందరికీ కరోనా వ్యాక్సిన్‌: ట్రంప్

ఏప్రిల్‌ వరకు అమెరికా పౌరులందరికీ కరోనా వ్యాక్సిన్‌: ట్రంప్

వచ్చే ఏడాది(2021) ఏప్రిల్ నాటికి అమెరికా పౌరులందరికీ సరిపడా కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వ్యాక్సిన్‌కు అనుమతులు లభించిన వెంటనే దేశంలోని పౌరులందరికీ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

వైట్‌హౌస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్…నెలకు లక్షలాది డోసులు ఉత్పత్తి చేస్తామని, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందరికీ సరిపడా డోసులు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు. దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే అందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్నారు. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్ కు సిద్ధమైనట్టు చెప్పారు. టీకా అందుబాటులోకి వస్తే ప్రజల ప్రాణాలకు ఉన్న ముప్పు తొలగిపోవడమే కాకుండా… అనేక రకాల ఆంక్షల నుంచి విముక్తి లభిస్తుందన్నారు ట్రంప్.