
కూకట్ పల్లి, వెలుగు: తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను రక్షించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తున్నదని కాంగ్రెస్ఎమ్మెల్సీ విజయశాంతి తెలిపారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం ఆమె కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి రమేశ్తో కలిసి మూసాపేటలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా వివిధ ఆలయాల వద్ద సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను ఆలయ కమిటీల నిర్వాహకులతో కలిసి అందజేశారు.