హైదరాబాద్, వెలుగు : టీఎస్ ఎంసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా ఈ నెల 21 నుంచి 29 వరకూ ఆన్లైన్లో రిజిస్ర్టేషన్ ప్రక్రియ ఉంటుందని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఓ ప్రకటనలో తెలిపారు. మూడు విడతల కౌన్సెలింగ్ షెడ్యూల్ను https://tseamcet.nic.in వెబ్ సైట్లో పెట్టామని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
‘‘స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 23 నుంచి 30 వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 2 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 6న ఫస్ట్ ఫేజ్ సీట్లను అలాట్ చేయనున్నారు. వచ్చే నెల 6 నుంచి 13 వరకూ ఆన్లైన్ లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది” అని అధికారులు తెలిపారు.
