మార్చి 18 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​

మార్చి 18 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​

హైదరాబాద్, వెలుగు: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి జరగనున్నాయి. శనివారం ఈ మేరకు ఎగ్జామ్స్ షెడ్యూల్‌‌ను ఎస్ఎస్‌‌సీ బోర్డు డైరెక్టర్ విడుదల చేశారు. సైన్స్ మినహా అన్ని ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహిస్తారు. 18న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఫస్ట్ ​లాంగ్వేజీ (గ్రూప్​–ఏ), ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు ఫస్ట్​ లాంగ్వేజీ పార్ట్–1(కంపోజిట్​ కోర్స్), ఫస్ట్​ లాంగ్వేజీ పార్ట్​-2 (కంపోజిట్​ కోర్స్) పరీక్షలు నిర్వహిస్తారు. 

19న సెకండ్ లాంగ్వేజీ, 21న థర్డ్ లాంగ్వేజీ (ఇంగ్లిష్), 23న మ్యాథమెటిక్స్, 26న ఉదయం 9.30 నుంచి 11 గంటలకు వరకు సైన్స్​పార్ట్​–1 (ఫిజికల్​ సైన్స్), 28న ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు సైన్స్ పార్ట్​–2 (బయోలాజికల్​ సైన్స్), 30న ఉదయం 9.30 నుంచి 12.30 వరకు సోషల్​ స్టడీస్ ​పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్​ఒకటిన ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజీ పేపర్​–1 (సంస్కృతం, అరబిక్) ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, అదే రోజు ఉదయం 9.30 నుంచి 11.30 వరకు ఎస్ఎస్​సీ ఒకేషనల్​ కోర్సు (థియరీ), ఏప్రిల్​2న ఉదయం 9.3‌‌‌‌0 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఓఎస్ఎస్సీ మెయిన్​లాంగ్వేజీ పేపర్​–2 (సంస్కృతం, అరబిక్) నిర్వహిస్తారు.

 ఆబ్జెక్టివ్ టైప్​(పార్ట్​–బీ) సమాధానం ఇచ్చే ప్రశ్నలను చివరి అరగంటలో మాత్రమే పూర్తి చేయాలని తెలిపారు. ఎస్ఎస్‌‌సీ బోర్డు ప్రకటించిన టైం టేబుల్ రోజుల్లో ఎలాంటి సెలవులు ఉన్నా పరీక్షలు కొనసాగిస్తామని చెప్పారు.