- ప్రకటించిన టీఎస్పీఎస్సీ563 పోస్టులకు ఇటీవలే నోటిఫికేషన్
- కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ
హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీని టీఎస్పీఎస్సీ ఖరారు చేసింది. జూన్ 9న నిర్వహిస్తామని సోమవారం ప్రకటించింది. 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఇటీవలే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 23 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల 14 వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. ఈ క్రమంలోనే జూన్ 9న ప్రిలిమ్స్ పెడ్తామని కమిషన్ వెల్లడించింది. దీంట్లో 1:50 రేషియోలో ఓపెన్ మెరిట్ ఆధారంగా మెయిన్స్కు ఎంపిక చేస్తారు. మెయిన్ ఎగ్జామ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహిస్తామని ఇప్పటికే కమిషన్ వెల్లడించింది.
‘గ్రౌండ్ వాటర్’ పోస్టుల ర్యాంకులు రిలీజ్
గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల రిక్రూట్మెంట్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్)ను టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది.
గెజిటెడ్ కేటగిరీలో అసిస్టెంట్ హైడ్రోమెట్రా లజిస్ట్, అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్, అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్, నాన్ గెజిటెడ్ కేటగిరీలో టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రో జియాలజి, హైడ్రోలజీ, జియోఫిజిక్స్, ల్యాబ్ అసిస్టింట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులకు వేర్వేరు ర్యాంకింగ్ లిస్టులు విడుదల చేసింది. త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది.