పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు : డిపో మేనేజర్ వేణుగోపాల్

పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు : డిపో మేనేజర్ వేణుగోపాల్

వనపర్తి, వెలుగు: పుణ్యక్షేత్రాల దర్శనం, విహారయాత్రల కోసం ప్రత్యేక టూర్  ప్యాకేజీలకు ఎక్స్​ప్రెస్, డీలక్స్, సూపర్  లగ్జరీ బస్సులను అందిస్తున్నట్లు డిపో మేనేజర్  వేణుగోపాల్​ తెలిపారు. కాణిపాకం, వేలూరు, అరుణాచలం, గోవా, మురుడేశ్వర్, ధర్మస్థల, షిరిడి, తుల్జాపూర్, గానుగాపూర్, వైజాగ్, భద్రాచలం, వరంగల్  వెయ్యి స్తంభాల గుడి, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాలకు ఒకటి, రెండు, మూడు రోజుల టూర్  ప్యాకేజీలు ఉంటాయని చెప్పారు. 

ఆసక్తి ఉన్న ప్రయాణికులు 24 లోగా టికెట్  బుక్  చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9959226289,7995701851 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.