
వనపర్తి, వెలుగు: పుణ్యక్షేత్రాల దర్శనం, విహారయాత్రల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీలకు ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను అందిస్తున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. కాణిపాకం, వేలూరు, అరుణాచలం, గోవా, మురుడేశ్వర్, ధర్మస్థల, షిరిడి, తుల్జాపూర్, గానుగాపూర్, వైజాగ్, భద్రాచలం, వరంగల్ వెయ్యి స్తంభాల గుడి, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాలకు ఒకటి, రెండు, మూడు రోజుల టూర్ ప్యాకేజీలు ఉంటాయని చెప్పారు.
ఆసక్తి ఉన్న ప్రయాణికులు 24 లోగా టికెట్ బుక్ చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9959226289,7995701851 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.