
ఆదిలాబాద్టౌన్, నిర్మల్ వెలుగు: ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీఎస్యూటీఎఫ్, యూఎస్పీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ సర్కార్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.అశోక్, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యం.జ్ఞానేశ్వర్ , ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకులు జాదవ్ వెంకట్ రావు, జిల్లా యూఎస్ పీఎస్ నాయకులు దాసరి శంకర్, పెంట అశోక్, షబ్బీర్ అలీ, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ నెల 23న హైదరాబాద్ లో చేపట్టనున్న రాష్ట్రస్థాయి మహా ధర్నాకు టీచర్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు. కలెక్టర్ ఆఫీస్ ఏఓకు వినతిపత్రం అందించారు.