తిరుమల శ్రీవారి భక్తులకు మరో అవకాశం

తిరుమల శ్రీవారి భక్తులకు మరో అవకాశం

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో అవకాశం కల్పించింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షల కారణంగా తిరుమల స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు ప్రత్యేక దర్శన సదుపాయాన్ని కల్పించింది. ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు టికెట్లు కలిగిన భక్తులు.. దర్శన టికెట్టు మార్చుకునే వెసులుబాటు కల్పించింది. TTD వెబ్‌సైట్‌లో దర్శన తేదీని మార్చుకోవడంతో పాటు..కొత్త టికెట్లను పొందే అవకాశం కల్పించింది.

ఆరునెలలలోపు ఎప్పుడైనా పాత దర్శనం టికెట్లతో.. నూతన టికెట్టు పొందవచ్చని తెలిపారు టీటీడీ అధికారులు.  ప్రస్తుతం వర్షం తగ్గిందని.. తిరుమలకు చేరుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేసింది. రెండు ఘాట్‌ రోడ్లలో వాహనాలను అనుమతిస్తున్నామని.. ఘాట్‌ రోడ్డు ప్రాంతాల్లో నిర్మాణపనులు జరుగుతున్నాయని TTD తెలిపింది.  శ్రీవారి మెట్ల మార్గం నాలుగు ప్రాంతాలు దెబ్బతిన్నాయని.. అలిపిరి నడక మార్గంలో ఎలాంటి నిర్మాణాలు దెబ్బతినలేదని చెప్పింది.