శ్రీవారి ఆర్జిత సేవల ధరలు పెంచనున్న టీటీడీ

శ్రీవారి ఆర్జిత సేవల ధరలు పెంచనున్న టీటీడీ

రెండేళ్ల కిందట నిలిపివేసిన శ్రీవారి ఆర్జిత సేవలను పునఃప్రారంభించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవన్ లో TTD ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. సమావేశం తర్వాత  ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. ఆర్జిత సేవల ధరలు పెంచాలన్న ప్రతిపాదనకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపినట్టు చెప్పారు.

ఇప్పటివరకు ఉన్న ఆర్జిత సేవల ధరలు పాతికేళ్ల కిందట నిర్ణయించినవని తెలిపారు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి. ఇవాళ్టి సమావేశంలో సుప్రభాతం, తోమాల, అర్చన, కల్యాణోత్సవ టికెట్ల ధరల పెంపుపై చర్చ జరిగింది. సేవా టికెట్ల ధర పెంపుపై ధర్మకర్తల మండలి ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

మరిన్ని వార్తల కోసం..

 

నేను ప్రతిరోజూ మీ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటా