గాంధీపై ట్వీట్‌‌.. ఐఏఎస్ బదిలీ

గాంధీపై ట్వీట్‌‌.. ఐఏఎస్ బదిలీ

మహాత్మా గాంధీపై వివాదాస్పద ట్వీట్​చేసిన ఐఏఎస్​ఆఫీసర్ ​నిధి చౌధరిని మహారాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్​ఫర్​చేసింది. ముంబై మున్సిపల్​కార్పొరేషన్​నుంచి మంత్రాలయ వాటర్​సప్లై డిపార్ట్​మెంట్​కు ఆమెను బదిలీ చేసింది. ట్వీట్​పై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గాంధీ విగ్రహాలను తొలగించాలని, కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను తీసేయాలని నిధి చౌధరి ట్వీట్​చేశారు. గాంధీని హత్య చేసిన నాథూరామ్​గాడ్సేకు ధన్యవాదాలంటూ ట్వీట్​లో పేర్కొన్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తంకావడంతో నిధి మాటమార్చారు. తన ట్వీట్​కు తప్పుడు అర్థాలు ఆపాదించారని వివరణ ఇచ్చారు.