శిక్షణ విమానం కూలి ఇద్దరు నేవీ ఉద్యోగులు మృతి

శిక్షణ విమానం కూలి ఇద్దరు నేవీ ఉద్యోగులు మృతి

తిరువనంతపురం: కేరళలో ప్రమాదవశాత్తు శిక్షణ విమానం కూలిన‌ దుర్ఘటనలో ఇద్దరు నేవీ ఉద్యోగులు మృతి చెందారు. ఆదివారం ఉదయం నావికాదళానికి సమీపంలో ఉన్న కొచ్చి తొప్పంపాడి వంతెన సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నౌకాదళ ఉద్యోగులు రాజీవ్ ఝా, సునీల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. సాధారణ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా ఈ గ్లైడర్ ఐఎన్ఎస్ గరుడ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిందని అధికారులు వెల్లడించారు.

విమాన ప్రమాద ఘటనపై సదరన్ నావల్ కమాండ్ బోర్డ్ ఆఫ్ విచారణకు ఆదేశించింది.ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మరణించారని వైద్యులు ప్రకటించారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొనేందుకు ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదికను రూపొందించనుంది.ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు.