రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ ఫ్రైజ్

రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ ఫ్రైజ్

ఈ ఏడాది రసాయన శాస్త్రలో నోబెల్ అవార్డ్ ఇద్దరికి వరించింది. జర్మనీకి చెందిన బెంజమిన్ లిస్ట్‌, అమెరికాకు చెందిన డేవిడ్ డబ్ల్యూసీ మెక్‌మిలన్‌లకు కెమిస్ట్రీ నోబెల్ ఇస్తున్నట్లు అకాడమీ ప్రకటించింది. అణువులను నిర్మించడానికి అసిమెట్రిక్ ఆర్గానోకాటలిసిస్ అనే కొత్త మార్గాన్ని అభివృద్ధి చేసినందుకుగాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు లిస్ట్‌, మెక్‌మిలన్‌లకు దక్కింది. లిస్ట్‌, మెక్‌మిలన్‌ల ఆవిష్కరణ ఫార్మాసూటికల్ పరిశోధనలపై చెప్పుకోదగిన ప్రభావం చూపిందని తెలిపింది.