తొమ్మిదేళ్ల క్రితం విధానానికి మళ్లీ అనుమతి
ఇండియన్ స్టూడెంట్లకు ప్రయోజనం
లండన్: ఫారిన్ స్టూడెంట్ల కోసం కొత్తగా రెండేళ్ల పోస్ట్ స్టడీ వర్క్ వీసాను బ్రిటన్ సర్కారు అందుబాటులోకి తెచ్చింది. బ్రిటన్ యూనివర్సిటీల్లో ఇండియన్ స్టూడెంట్ల సంఖ్యను పెంచేందుకు ఈ వీసాను అందుబాటులోకి తేవాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. దీనిపై బుధవారం బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త వీసా విధానం వచ్చే ఏడాది నుంచి అమలులోకి వస్తుంది. వ్యాలీడ్ యూకే ఇమ్మిగ్రేషన్ స్టేటస్ కలిగిన ఫారిన్ స్టూడెంట్లు ఈ వీసాకు అర్హులు. బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం పొందిన ఏదైనా ఓ హైయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్లో ఏ సబ్జెక్ట్లో అయినాసరే అండర్గ్రాడ్యుయేట్ లెవెల్ లేదా అంతకంటే ఎక్కువ పూర్తి చేసి ఉండాలి. అప్పుడు ఆ స్టూడెంట్లు రెండేళ్ల పాటు తమకు నచ్చిన చోట పనిచేసే అవకాశం లభిస్తుంది.
రెండేళ్ల తర్వాత వారు ఏదైనా జాబ్ సంపాదిస్తే స్కిల్డ్ వర్క్ వీసాకు మారవచ్చు. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం అప్పటి బ్రిటన్ ప్రధాని థెరిసా మే.. ఈ వీసా విధానాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి బ్రిటన్కు వెళ్లే ఇండియన్ స్టూడెంట్ల సంఖ్య ఏటా తగ్గుతూ వచ్చింది. దీంతో రెండేళ్ల పోస్ట్ స్టడీ వర్క్ వీసాను మళ్లీ తీసుకొస్తూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం తీసుకున్నారు. ‘‘ట్యాలెంట్ ఉన్న ఫారిన్ స్టూడెంట్లు బ్రిటన్ వచ్చి చదువుకునేందుకు ఈ వీసా ఉపయోగ పడుతుంది. ఆ తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ద్వారా సక్సెస్ఫుల్ కెరీర్ను వారు లీడ్ చేయగలుగుతారు”అని బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ చెప్పారు.