భారత నౌకాదళం సారథ్యంలో.. మిలాన్​ నౌకాదళ విన్యాసాలు

భారత నౌకాదళం సారథ్యంలో.. మిలాన్​ నౌకాదళ విన్యాసాలు

నౌకాదళ విభాగంలో ప్రతిష్టాత్మకమైన 11వ మిలాన్​ (బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు) విన్యాసాలు తొలిసారిగా విశాఖపట్టణంలో 2022 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 వరకు నిర్వహించారు. ఈ విన్యాసాలకు భారత నౌకాదళం సారథ్యం వహించింది. 

స్నేహం–సమన్వయం–సహకారం‘ థీమ్​తో 2022 ఏడాది మిలాన్​ విన్యాసాలు నిర్వహించారు. విశాఖపట్టణంలోని తూర్పు నావికాదళం(ఈస్ట్రన్​ నేవల్​ కమాండ్​) ప్రధాన స్థావరంలో ఈ విన్యాసాలు జరిగాయి. మిలాన్​ విన్యాసాల్లో 39 దేశాలు పాల్గొన్నాయి. 

  • రెండేళ్లకు ఒక్కసారి నిర్వహించే మిలాన్​ విన్యాసాలు 1995లో ప్రారంభమయ్యాయి. మిలాన్​ అంటే హిందీలో సమావేశం అని అర్థం. వివిధ దేశాల మధ్య సుహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడంతోపాటు శత్రు సైన్యానికి బలం, బలగం గురించి తెలియజేసేందుకు మిలాన్​ విన్యాసాలు నిర్వహిస్తుంటారు. 
  • ఇప్పటివరకు 11 సార్లు మిలాన్​ విన్యాసాలు జరిగాయి. 
  • మిలాన్​ను మినీ ఐఎఫ్​ఆర్​గా పిలుస్తారు. ఈసారి జరిగిన మిలాన్​ – 2022లో అంతర్జాతీయ ప్లీట్​ రివ్యూ (ఇంటర్నేషనల్​ ప్లీట్​ రివ్యూ – ఐఎఫ్​ఆర్​)కు దీటుగా 39 దేశాలు పాల్గొన్నాయి.