ఐపీఓలో పెట్టుబడులపై అవగాహన అవసరం

ఐపీఓలో పెట్టుబడులపై అవగాహన అవసరం

న్యూఢిల్లీ : ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) కు వచ్చిన కంపెనీలు  ఇన్వెస్టర్లకు భారీ లాభాలిస్తున్నాయి. కానీ, ఇప్పుడిప్పుడే ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేస్తున్నవారు ఇందులోని రిస్క్‌‌‌‌లను ముందు తెలుసుకోవాలి. కీలకమైన పాయింట్లను అర్థం చేసుకోవాలి. రీసెర్చ్ చేశాకనే  ఐపీఓల్లో  ఇన్వెస్ట్  చేయడంపై నిర్ణయం తీసుకోవాలి.

ఐపీఓల గురించి నిపుణులు చెప్పిన ముఖ్యమైన అంశాలు.

1. రెండు రకాల ఐపీఓలు పాపులర్. ఫిక్స్‌‌‌‌డ్ ప్రైస్ ఐపీఓలో ఒక ధరను కంపెనీ నిర్ణయిస్తుంది. ఈ ధర దగ్గరనే ఇన్వెస్టర్లు సబ్‌‌‌‌స్క్రయిబ్ అవుతారు.  కంపెనీల ఫైనాన్షియల్స్‌‌‌‌, ఇండస్ట్రీ ట్రెండ్‌‌‌‌, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఐపీఓలో షేర్ల ధరలను నిర్ణయిస్తారు. అదే బుక్‌‌‌‌ బిల్డింగ్ ఇష్యూలో  కంపెనీలు తాము అమ్మే షేర్ల కోసం ఓ ప్రైస్ రేంజ్ ప్రకటిస్తాయి. ఈ రేంజ్‌‌‌‌లోనే సబ్‌‌‌‌స్క్రయిబ్ అవ్వడానికి వీలుంటుంది. డిమాండ్ బట్టి ఫైనల్ ఇష్యూ ధర మారుతుంది.
2.  ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రెగ్యులేషన్స్‌‌‌‌పై అవగాహన ఉండాలని ఎనలిస్టులు చెబుతున్నారు. కంపెనీలు బయటపెట్టాల్సిన డేటా, ఇతర ముఖ్యమైన అంశాలపై సెబీ రూల్స్ ఉన్నాయి.
3. ఐపీఓలో ఇన్వెస్ట్ చేసేముందు కంపెనీల బిజినెస్ మోడల్‌‌‌‌ను అర్థం చేసుకోవాలి. ఎంత రెవెన్యూ, లాభం వస్తోందో చూడాలి. భవిష్యత్‌‌‌‌లో కంపెనీ గ్రోత్ పెరుగుతుందా? అని విశ్లేషించాలి.
4. ఐపీఓలో షేర్లు ఎలా అలాట్ అవుతాయో తెలుసుకోవడం ముఖ్యం. ఐపీఓ ఓవర్‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌స్క్రయిబ్ అయితే  షేర్లను కంప్యూటరైజ్డ్ విధానంలో కేటాయిస్తారు. అందరికీ షేర్లు అలాట్ కావు.
5.  మార్కెట్‌‌‌‌లో షేర్లు లిస్ట్ కాకముందు అనఫీషియల్ మార్కెట్‌‌‌‌లో  కంపెనీల షేర్లు దొరుకుతుంటాయి. ఈ మార్కెట్‌‌‌‌లో షేర్ల  ధరను గ్రేమార్కెట్ ప్రీమియం అంటారు.
6.  కంపెనీల ఐపీఓ ధరలను అదే ఇండస్ట్రీలోని ఒకే విధమైన కంపెనీల షేర్లతో పోల్చి చూడాలి. ధర ఎక్కువ ఉంటే ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.