- 558 పోస్టుల రిక్రూట్మెంట్కు జనవరిలో నిర్ణయం
- ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న మేనేజ్మెంట్
- నాలుగు జిల్లాల నిరుద్యోగులకు 90శాతం ఉద్యోగాలు
- ఐదు నెలలుగా కోల్బెల్ట్ యువత ఎదురుచూపు
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థలో కొత్త జాబ్ నోటిఫికేషన్ల కోసం కోల్బెల్ట్ ఏరియా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. మెడికల్ ఇన్వాలిడేషన్తో కార్మిక కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సింగరేణి సంస్థ ఖాళీ పోస్టుల రిక్రూట్మెంట్ పట్టించుకుంటలేదు. 558 పోస్టులు భర్తీ చేస్తామని మురిపించిన మేనేజ్మెంట్ ఐదు నెలలు అవుతున్నా నోటిఫికేషన్ ప్రకటించలేదు.
ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామని..
సింగరేణిలో ఖాళీగా ఉన్న 558 పోస్టులను కొత్తవారితో పాటు ఇంటర్నల్ ఎంప్లాయీస్తో భర్తీ చేస్తామని జనవరిలో మేనేజ్మెంట్ ప్రకటించింది. ఇందుకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొంది. ఇంజినీరింగ్, పర్సనల్, అకౌంట్స్, మైనింగ్, వైద్య విభాగాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 558 పోస్టుల్లో 277 కొత్తవారికి, 281 ఖాళీలను సింగరేణి సంస్థలో పనిచేసే ఇంటర్నేషనల్ ఎంప్లాయీస్కు చాన్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
నగరాల్లో కోచింగ్..
ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ పరిధిలో యువతకు ఈ పోస్టుల్లో 90శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఎక్కువ శాతం ఇంజినీరింగ్తో పాటు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ పూర్తి చేసిన అభ్యర్థులున్నారు. సింగరేణి సంస్థ భారీ మొత్తంలో నియామకాలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో కోల్బెల్ట్ ఏరియా గ్రాడ్యుయేట్లు హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో కోచింగ్ తీసుకుంటున్నారు. మరోవైపు వారసత్వ ఉద్యోగాల కింద సింగరేణి కంపెనీలో చేరిన ఉద్యోగులు(ఇంటర్నల్) ఇంజినీరింగ్, ఎంబీఏ, పీజీలు చదివిన వారు ఉండడంతో మేనేజ్మెంట్ జారీ చేసిన ఇంటర్నల్ పోస్టులు దక్కించుకోవడానికి ఆశగా
ఎదురుచూస్తున్నారు.
ప్రకటించిన పోస్టులివే..
ఫిట్టర్ ట్రైనీ
(కేటగిరి-1) 114
మేనేజ్మెంట్ ట్రైనీ(మైనింగ్) 79
మేనేజ్మెంట్ ట్రైనీ(మెకానికల్) 66
వెల్డర్ ట్రైనీ(కేటగిరి-1) 43
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు 30
అసిస్టెంట్ ఇంజనీర్(ఈ2) 30
జూనియర్ ఇంజినీర్(ఈ1) 20
జూనియర్ కెమిస్టు,
టెక్నికల్ ఇన్స్పెక్టర్ 20
పర్సనల్ డిపార్ట్మెంట్ 22
మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ 18
సబ్ ఓవర్సిస్ ట్రైనీ(సివిల్) 16
వెల్ఫేర్ ఆఫీసర్లు(ఈ1) 11
ఇండస్ర్టియల్ ఇంజినీర్ 10
జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్స్ 10
ఐటీ డిపార్ట్మెంట్ 7
శానిటరీ ఇన్స్పెక్టర్(కేటగిరి-డి), 5
అసిస్టెంట్ ఇంజినీర్(ఈ2) 4
జూనియర్ ఇంజినీర్(ఈ1) 4
ప్రోగ్రామర్ ట్రైనీ(ఈ1) 4
జూనియర్ ఫారెస్టు ఆఫీసర్ 3
హైడ్రోజియాలజిస్టు 2
పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం
సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో మేనేజ్మెంట్నిర్లక్ష్యం చేస్తున్నది. అన్ని విభాగాల్లో ఉద్యోగుల కొరతతో పనిచేస్తున్న వాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. 558 పోస్టుల ఖాళీల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి.
-కాంపెల్లి సమ్మయ్య, ఐఎన్టీయూసీ లీడర్