- వచ్చే ఏడాది డిసెంబరులో ప్రధానితో ప్రారంభోత్సవం
- రూ.719 కోట్లతో ఆధునీకరణ పనులు
- మెట్రో, బస్స్టేషన్లకువాక్త్రూ ఫెసిలిటీ
- పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
హైదరాబాద్సిటీ, వెలుగు: దేశంలోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను ది బెస్ట్గా రూపొందిస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. నిజాం హయాంలో నిర్మాణం జరుపుకున్న ఈ రైల్వేస్టేషన్లో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రూ.719 కోట్లతో పునర్నిర్మాణం చేస్తున్నట్టు వెల్లడించారు. సోమవారం ఆయన రైల్వేస్టేషన్ను సందర్శించి పనులను పరిశీలించారు. అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది డిసెంబర్నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కోరారు. ప్రధాని మోదీతో ప్రారంభోత్సవం చేయించనున్నట్టు తెలిపారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరహాలో..
సికింద్రాబాద్రైల్వేస్టేషన్1,65,566 చ. మీ. విస్తీర్ణంలో నిర్మాణం జరుపుకుంటోందని, రోజుకు 1.97 లక్షల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని, ఈ సంఖ్య గంటకు 23వేలుగా ఉందని మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. ఆధునీకరణ తర్వాత గంటకు 35,500 వేల మంది చొప్పున రోజుకు 2.70లక్షలకు చేరుకుంటుందన్నారు. స్టేషన్లో 3వేల మంది కూర్చునేలా వెయిటింగ్హాల్, ఆధునిక క్యాంటీన్, రెస్టారెంట్అందుబాటులోకి రానున్నాయన్నారు. తెలంగాణ కళలు ఉట్టిపడే చిత్రాలను సికింద్రాబాద్పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగు నెలల్లో సౌత్సైడ్బ్లాక్ప్రారంభిస్తామన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను రూపొందిస్తున్నట్టు కిషన్రెడ్డి వెల్లడించారు.
26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 26 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు కిషన్రెడ్డి తెలిపారు. ట్రైన్దిగిన వారు నేరుగా మెట్రోస్టేషన్లకు వెళ్లే విధంగాఈస్ట్, వెస్ట్ సైడ్ నేరుగా వాక్ త్రూ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. బస్ స్టేషన్లకు సైతం వాక్త్రూ ద్వారానే చేరుకునేలా సదుపాయలు కల్పిస్తున్నామన్నారు. రైలు దిగన వారు బయటకు రాకుండా స్టేషన్నుంచి మెట్రో, బస్ స్టేషన్లకు వెళ్లడానికి అవకాశం ఉంటుందన్నారు. స్టేషన్పరిధిలో రెండు భారీ సబ్స్టేషన్లను 5 కిలోవాట్ల కెపాసిటీతో నిర్మిస్తున్నట్టు చెప్పారు. స్టేషన్భద్రతకు అడ్వాన్సుడ్సెక్యూరిటీ సిస్టమ్ఏర్పాటు చేస్తున్నామన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్అడిషనల్ జనరల్మేనేజర్సత్యప్రకాశ్, డివిజనల్రైల్వే మేనేజర్ఆర్. గోపాలకృష్ణన్, చీఫ్అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్రణధీర్రెడ్డి, పీసీఆర్ఓఎ. శ్రీధర్ పాల్గొన్నారు.
