
న్యూఢిల్లీ: ఇండియాని ఇంటి గ్రేట్ చేసిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి నాడే కాశ్మీర్ కొత్త ఉదయాన్ని చూడబోతోంది. కొత్తగా ఏర్పాటైన జమ్మూకాశ్మీర్ , లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు అక్టోబర్ 31 నుంచి ఉనికిలోకి రానున్నా యి. పార్లమెంట్ ఓకే చేసిన విభజన బిల్లు కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం ఆమోదం తెలిపారు . దీంతో జమ్మూకాశ్మీర్ విభజన చట్టం 2019 అమల్లోకి వచ్చింది. ఆ వెంటనే ఆవిర్భావ తేదీని ఖరారుచేస్తూ కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన చేసింది. కాశ్మీర్కు స్పెషల్ స్టేటస్ కల్పించే ఆర్టికల్ 370ని ఎత్తేస్తూ రాష్ట్రపతి మూడ్రోజుల కిందటే గెజిట్ జారీ చేశారు . శుక్రవారం విభజన చట్టం కూడా అమల్లోకి రావడంతో కొత్త యూటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఆర్టికల్370 రద్దుతో జమ్మూకాశ్మీర్ విలీనాన్ని పూర్తిచేశామమన్న ప్రధాని నరేంద్ర మోడీ.. దీంతో సర్దార్ పటేల్, బీఆర్ అంబేద్కర్, శ్యామప్రసాద్ ముఖర్జీ,వాజపేయి లాంటి దేశనేతలకు ఘన నివాళిలాంటి దని గురువారం నాటి ప్రసంగంలో అన్నారు .జమ్మూలో నేటి నుంచి స్కూళ్లు ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న కేంద్రం.. శనివారం నుంచి జమ్మూలో 144 సెక్షన్ ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. స్కూళ్ల నుంచి యూనివర్సిటీల దాకా అన్ని విద్యాసంస్థలు శనివారం నుంచి పని చస్తాయని అధికారులు తెలిపారు .