
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ అయోధ్య పర్యటనను రద్దైంది. అయోధ్య మందిర నిర్మాణానికి సంబందించిన ఏర్పాట్లను సీఎం యోగి ఇవాళ(ఆదివారం) పరిశీలించాల్సి ఉంది. అయితే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కమలా రాణి కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందారు. దాంతో యోగి పర్యటనను రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరగనుంది. ఆ కార్యక్రమ ఏర్పాట్లను సందర్శించడానికి ఇవాళ మధ్యాహ్నం రామ జన్మభూమిని సందర్శించాల్సి ఉంది. అంతే కాకుండా రామ్ కి పాడి , హనుమన్గారి ఆలయాన్ని కూడా సందర్శించాల్సి ఉంది. యోగి పర్యటన రద్దు కావటంతో హనుమాన్గారి ఆలయం దగ్గర నిషన్ పూజను రద్దు చేశామని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు.