పేటీఎంలో ఉప్పల్​ మ్యాచ్​ టికెట్లు.. నిమిషంలోనే సోల్డ్ అవుట్

పేటీఎంలో ఉప్పల్​ మ్యాచ్​ టికెట్లు.. నిమిషంలోనే సోల్డ్ అవుట్
  • క్రికెట్ ఫ్యాన్స్​కు మరోసారి నిరాశ
  • బ్లాక్​లో టికెట్లు అమ్ముకున్నారని ఆవేదన

హైదరాబాద్: సిటీలో క్రికెట్ ఫ్యాన్స్​కు మరోసారి నిరాశే ఎదురైంది. ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ దొరకకుండా చేసారని అభిమానులు ఆవేదన వ్యక్తంచేశారు. బ్లాక్ లో టికెట్స్ అమ్ముకుంటున్నారంటూ వాపోయారు. ఐపీఎల్​లో భాగంగా ఉప్పల్ లో సన్​రైజర్స్​హైదరాబాద్​ఏప్రిల్ 25న బెంగళూరుతో, మే 2న రాజస్థాన్ జట్లతో మ్యాచ్ ఆడనుంది. దీనికి సంబంధించి నిర్వాహకులు పేటీఎంలో టికెట్స్ విక్రయానికి పెట్టారు.  అయితే పెట్టిన మరు నిమిషంలోనే సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయని అభిమానులు ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు పేటీఎంలో ఎన్ని టికెట్స్ విక్రయిస్తున్నారో  ఎస్ఆర్ హెచ్​టీం మేనేజ్మెంట్ లెక్క చెప్పలేదన్నారు.