అర్బన్ వర్క్ ఆఫీసు ప్రారంభం

అర్బన్ వర్క్ ఆఫీసు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ఆఫీసు  స్థలాన్ని విక్రయించే అర్బన్ వర్క్ తమ కొత్త కేంద్రాన్ని హైదరాబాద్​లోని రహేజా మైండ్ స్పేస్​లో ప్రారంభించింది.  ఈ అత్యాధునిక వర్క్ స్పేస్ 50 వేల చదరపు అడుగులు విస్తరించింది. ఇక్కడ దాదాపు 900 మంది కూర్చోవచ్చు.  50–500 వరకు ఉద్యోగులు ఉన్న సంస్థలకు సేవలను అందించడం ల క్ష్యంగా పెట్టుకున్నామని అర్బన్​వర్క్​ తెలిపింది.

 ఈ కేంద్రం నేటి వ్యాపారాలు,  నిపుణుల అవసరాలను తీర్చగలుగుతుందని పేర్కొంది. ప్యాంట్రీ, కేఫ్,  ఆటల ప్రదేశ వంటి సదుపాయాలు ఉన్నాయి.  ఫ్లెక్సీ స్పేస్ మార్కెట్లో 2023 నాటికి హైదరాబాద్ నగరవాటా ఆరు శాతం ఉందని వెల్లడయింది.  భారతీయ ఫ్లెక్స్ స్పేస్ మార్కెట్ 2026 నాటికి 80 మిలియన్ చదరపు అడుగుల స్థాయికి చేరుకుంటుందని అంచనా.