మా మాటల్ని తప్పుగా అర్థం చేస్కున్నరు

మా మాటల్ని తప్పుగా అర్థం చేస్కున్నరు

వాషింగ్టన్ :  ప్రవాసాంధ్ర యువతి జాహ్నవి కందుల యాక్సిడెంట్ కేసులో తమ మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ పోలీసులు వాదించారు. జాహ్నవిని తన పెట్రోలింగ్ వెహికల్​తో ఢీకొట్టి ఆమె మృతికి కారణమైన పోలీస్ ఆఫీసర్ కెవిన్ డేవ్, మరో ఆఫీసర్ డేనియల్ ఆడెరర్ నవ్వుతూ కామెంట్లు చేయడం, ఆ వీడియో ఇటీవల బయటకు రావడంతో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను వెనకేసుకొస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో మొత్తం కాకుండా, చిన్న క్లిప్ మాత్రమే ఉందని తెలిపింది. ఆఫీసర్ ఆడెరర్ రాసిన లేఖను కూడా విడుదల చేసింది. 

యాక్సిడెంట్​లో మరణించిన జాహ్నవికి కాంపెన్సేషన్ విషయంలో లాయర్లు ఎలా వాదిస్తారన్న దానిపైనే తాము జోక్​లు వేసుకున్నామని అందులో ఆడెరర్ తెలిపాడు. వాస్తవానికి తాము పర్సనల్ గా మాట్లాడుకున్నామని, కానీ ఆ మాటలు అనుకోకుండా రికార్డ్ అయ్యాయన్నాడు. తన వైపు మాటలు మాత్రమే రికార్డ్ అయ్యాయని, దీంతో అవి విన్న వారికి విషయం పూర్తిగా అర్థం కాలేదని పేర్కొన్నారు.

Also Raed :- ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్న ఒకరి అరెస్ట్ .. పరారీలో ప్రధాన నిందితుడు

కాగా, ఏపీకి చెందిన జాహ్నవి కందుల వాషింగ్టన్స్ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చదువుతోంది. ఆమె జనవరి 23న రాత్రి రోడ్డు దాటుతుండగా కెవిన్ డేవ్ తన పెట్రోలింగ్ కార్​తో ఢీకొట్టాడు. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

ఆన్ లైన్​లో సంతకాల సేకరణ.. 

జాహ్నవి కందుల కుటుంబానికి న్యాయం చేయాలని, పోలీస్ ఆఫీసర్ ఆడెరర్ ను టర్మినేట్ చేయాలంటూ చేంజ్ డాట్ ఆర్గ్ లో ఆన్ లైన్ పిటిషన్ ప్రారంభమైంది. దీనిపై శుక్రవారం సాయంత్రం సమయానికి 6,700 మంది సంతకాలు చేశారు.పోలీసులు జవాబుదారీతనం వహించేలా చూడాలని సిటీ మేయర్, కౌన్సిల్ మెంబర్ల ను డిమాండ్ చేస్తూ ఎన్ఆర్ఐలు ఈ ఆన్ లైన్ పిటిషన్ లో సంతకాలు చేస్తున్నారు.