
అమెరికాలో దారుణం..శనివారం(జూన్14) ఇద్దరు శాసనసభ్యుల ఇళ్లపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మిన్నెసోటా గవర్నర్ మెలిస్సా హోర్ట్ మెన్, ఆమె భర్తను దుండగులు కాల్పిచంపారు. మరో శాసన సభ్యుడు జాన్ హాఫ్ మన్ ను అతని భార్య కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు.
శనివారం తెల్లవారు జామున బ్రూక్లిన్ పార్క్ శివారులోని కమ్యూనిటీలలో ఇద్దరు మిన్నెసోటా శాసనసభ్యుల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి ఓ అధికారి దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా చెబుతోంది. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
మిన్నెసోటోలో జరిగిన కాల్పులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భయంకరమైన హింసగా అభివర్ణించారు. ఇటువంటి హింసను సహించం.. దర్యాప్తు చేసేందుకు FBI రంగంలోకి దింపాం.నిందితులను వదిలిపెట్టం అని అన్నారు.
నిందితుడు శాసనసభ్యుల ఇళ్లలోకి ప్రవేశించేందుకు ఓ అధికారి అవతారం ఎత్తాడని అనుమానిస్తున్నారు. SUV స్క్వాడ్ కారులా కనిపించే వాహనాన్ని వినియోగించాడని.. దీనిపై లైట్లు, అత్యవసర లైట్లు అమర్చబడి సరిగ్గా పోలీస్ వాహనం లాగే ఉందని స్థానిక పోలీసులు చెబుతున్నారు.అనుమానితుడి వాహనంలో ఇంక అనేకమంది శాసనసభ్యుల ఫొటోలు, ప్రభుత్వ అధికారుల లిస్టు దొరికింది. ఇది వారిని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
దుండగుల దాడిలో చనిపోయిన మెలిస్సా 2004లో తన శాసనసభ్యురాలిగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలోని అత్యంత ప్రభావవంతమైన డెమొక్రాటిక్ చట్టసభ సభ్యులలో ఒకరు. మిన్నెసోటా హౌస్లో ఆమె నాయకత్వం రాష్ట్ర రాజకీయాలపై శాశ్వత ముద్ర వేసింది. దాడి నుండి బయటపడిన సెనేటర్ జాన్ హాఫ్మన్ 2012 నుండి మిన్నెసోటా సెనేట్లో పనిచేస్తున్నారు.