న్యూయార్క్: అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారంటేనే.. న్యూస్ చానెళ్లన్నీ క్యూ కట్టేస్తాయి. కానీ, ట్రంప్ విషయంలో మాత్రం గురువారం సీన్ రివర్స్ అయింది. ప్రెసిడెంట్ అని కూడా చూడలేదు. వైట్హౌస్లో లైవ్ కట్చేసి ట్రంప్కు షాకిచ్చాయి. కవరేజ్ను వెంటనే కట్ చేసేశాయి. మరికొన్ని చానెళ్లు ప్రసా రంచేసినా ఆయన ఆరోపణలకు ఆధారాల్లేవని బ్రేకిం గ్లు వేశాయి. మొత్తంగా ఇంటర్నేషనల్ మీడియాలోని చానెళ్లు ట్రంప్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని నిరసన వ్యక్తంచేస్తున్నాయి. ‘‘గెలుపును నా నుంచి దోచేస్తున్నరు. కౌంటింగ్ ఆపేయాలి’’ అంటూ ట్రంప్ కామెంట్ చేశారు. పదే పదే ఇలాంటి ఆరోపణలే చేస్తుండడంతో చానెళ్లు ఆయన బ్రీఫింగ్ను ఆపేశాయి.
ప్రెసిడెంట్ను సరిదిద్దాల్సిందే..
‘‘ప్రెసిడెంట్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారు. ఓటింగ్లో మోసం జరిగిందనీ ఆరోపిస్తున్నారు. ఆయన చెబుతున్న మాటలకు ఆధారాలేవీ లేవు. కాబట్టి ఆయన లైవ్ను ఇక్కడితో ఆపేస్తున్నాం’’ అంటూ ఎన్బీసీ న్యూస్ యాంకర్ లెస్టర్ హోల్ట్ కామెంట్ చేశారు. ఎలక్షన్ డే తర్వాత వచ్చే ఓట్లన్నీ ఇల్లీగలేనంటూ ట్రంప్ అంటున్నారని, కానీ, ఆయన మాటల్లో నిజం లేదని సీబీఎస్ యాంకర్ నోరా ఓ డోనెల్ అన్నారు. కవరేజీని ఏబీసీ సడన్గా కట్చేసిన వెంటనే.. ఆ సంస్థ వైట్హౌస్ ప్రతినిధి జొనాథన్ కార్ల్ కూడా ట్రంప్ అంటున్న ఇల్లీగల్ ఓట్లకు ఆధారాలేవీ లేవన్నారు. నిజానికి ట్రంప్ కవరేజ్ కట్ చేసిన ఫస్ట్ చానెల్ ఎంఎస్ఎన్బీసీ. ఆయన లైవ్లోకి వచ్చిన జస్ట్ 19 క్షణాల్లోనే కనెక్షన్ను కట్ చేసింది. ‘ప్రెసిడెంట్ అయినా కూడా లైవ్ కవరేజ్ కట్ చేసేస్తున్నం’ అంటూ యాంకర్ చెప్పారు.
ఎఫ్బీలో సపోర్టర్స్ గ్రూప్ బ్యాన్
ట్రంప్ కు మద్దతుగా ఆందోళనలకు వేదికగా మారిన ‘స్టాప్ ద స్టీల్’ గ్రూప్ ను ఫేస్ బుక్ గురువారం బ్యాన్ చేసింది. రిపబ్లికన్ల నుంచి డెమొక్రాట్లు అధికారం లాక్కుంటున్నారని, ఓటింగ్ లో ఫ్రాడ్ జరిగిందని, గన్స్ క్లీన్ చేయాల్సిన టైమొచ్చిందని, వీధుల్లోకి వచ్చి పోరాడాలని ఈ గ్రూప్లోని మెంబర్లు పోస్టులు పెట్టారు. ఇది హింసను ప్రేరేపించేలా ఉందని, అందుకే బ్యాన్ చేసినట్టు ఫేస్ బుక్ తెలిపింది. ‘స్టాప్ ద స్టీల్’ గ్రూప్ లో మూడున్నర లక్షల మంది మెంబర్స్ ఉన్నట్టు పేర్కొంది.